అదేం లేదు... మేమిద్దరం బాగానే ఉన్నాం..!

Update: 2018-12-07 05:53 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ ల వలనే కొంత హైప్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలన్నీ యావరేజ్ హిట్స్ కాబట్టి ఈ సినిమాలో టాప్ హీరోయిన్ కాజల్ నటించడం ప్లస్ అయ్యింది. అయితే కవచం టీజర్ లాంచ్ లో ఎంతో సరదాగా పాల్గొన్న మెహ్రీన్ కౌర్ కి, కాజల్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా.. గత వారం జరిగిన కవచం ఆడియో వేడుకలో ఒక రూమర్ వినబడింది. ఎందుకంటే ఆ ఆడియో వేడుకలో కాజల్ పాల్గొంది కానీ.. మెహ్రీన్ డుమ్మా కొట్టింది.

దుబాయ్ లో గొడవ..?

ఇక ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయనడానికి... కాజల్, మెహ్రీన్ లు కలిసి కవచం ప్రమోషన్స్ లో పాల్గొనకుండా సోలోగా ఇంటర్వూస్ లో పాల్గొనడం, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ఒకసారి కాజల్, మరోసారి మెహ్రీన్ లు టీవీ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తున్నారు. అయితే మెహ్రీన్ కి, కాజల్ కి మధ్యన నిజంగానే కోల్డ్ వార్ నడుస్తుంది అని అంటున్నారు. అది కూడా కవచం షూటింగ్ టైంలోనే ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వీరిద్దరి మధ్యన కవచం సినిమా షూటింగ్ దుబాయ్ లో జరిగినప్పుడు విభేదాలు వచ్చాయని.. దుబాయ్ లో కవచం సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరోయిన్ మెహ్రీన్ తో కలిసి కాజల్ దుబాయ్ వెళ్లడానికి నిరాకరించింది.

అవేం లేవంటున్నా...

అయితే చివరికి కవచం ప్రొడ్యూసర్స్ బ్రతిమాలితే కాజల్ దుబాయ్ కి మెహ్రీన్ తోనే కలిసి వెళ్లిందట. అప్పటి నుండి కాజల్ మీద మెహ్రీన్ గుర్రుగా ఉందంటున్నారు. అయితే మా ఇద్దరి మధ్య గొడవలేమీ లేవని ఆ ఇద్దరు హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. తమ మధ్యన విభేదాలేం లేవని.. బయట వినబడేవన్నీ పుకార్లంటూ ఆ ఇద్దరి భామల ట్వీట్స్ చూస్తుంటే తెలుస్తుంది. మరి కాజల్, మెహ్రీన్ లు తమ మద్యనేం లేదని అభిమానులకు చెబుతున్నా... ఇద్దరి మధ్యన నిజంగానే ఏదో జరగబట్టే ఇలాంటి క్లారిటీలంటూ సెటైర్స్ వేస్తున్నారు కూడా...!

Similar News