పారితోషకం ఇవ్వకపోతే...అన్నపై ఫిర్యాదు చేస్తా

Update: 2018-07-11 06:37 GMT

ఈ మాట అన్నది ఎవరో కాదు... కోలీవుడ్ హీరో కార్తీ. చినబాబు సినిమా సరిగా ఆడకపోతే... తనకి పారితోషకం ఇవ్వనని చినబాబు నిర్మాత కార్తీ తో చెప్పాడట. అయితే దీనికి ఫన్నీగా కార్తీ తనకు పారితోషకం ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో చినబాబు నిర్మాతపై కంప్లైంట్ చేస్తానని చెబుతున్నాడు. ఇంతకీ చినబాబు నిర్మాత ఎవరో కాదు కార్తీ అన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. అందుకే సూర్యని ఆటపట్టించడానికి కార్తీ తనకు రెమ్యునరేషన్ ఇవ్వకపోతే కంప్లైంట్ చేస్తానని సరదాగా అంటున్నాడు. ఇంతకీ శుక్రవారం రాబోతున్న కార్తీ చినబాబు సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రమోషన్స్ లోను చినబాబు యూనిట్ ఎక్కడా తగ్గడం లేదు.

సినిమా కథ చెప్పిన కార్తీ...

అయితే సినిమా ప్రమోషన్స్ లో కార్తీ మట్లాడుతూ... చినబాబు సినిమా మొత్తం వ్యవసాయానికి, రైతు కుటుంబానికి సంబంధించిన సినిమా అని... వ్యవసాయం చేసుకుని బతుకుతున్న పెద్ద కుటుంబంలో తాను అందరి కన్నా చిన్నవాడిగా వ్యవసాయం చేస్తానని చెప్పారు. అలాగే గోదావరి యాసలో మాట్లాడతానని చెప్పిన కార్తీ.. ఈ సినిమా కి తన అన్నయ్య నిర్మాత అయినప్పటికీ... దర్శకుడు పాండిరాజ్ మీద నమ్మకంతో సూర్య ఎప్పుడూ చినబాబు షూటింగ్ స్పాట్ దగ్గరికి కూడా రాలేదని చెబుతున్నాడు కార్తీ. ఇక ఈ సినిమాకి ఎలా కావాలో అలాంటి బడ్జెట్ సూర్య అందించాడని చెబుతున్నాడు.

ప్రజలే చెప్పాలన్న అన్నయ్య...

అయితే తన అన్నని సినిమా ఎలా వచ్చిది అన్నయ్య అని అడగగా... ఆ విషయం నేను కాదు ప్రజలు చెప్పాలి అన్నాడు. ఇకపొతె నాకైతే ఈ చినబాబు సినిమా కంటెంట్ మీద బలమైన నమ్మకం వుంది. అలాగే ఈ సినిమాలో విలన్ అంటూ స్పెషల్ గా ఎవరినీ చూపించడం ఉండదు. అదే ఊళ్లో మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి .. చివరికి విలన్ గా మారడం చూపిస్తారు అంటూ తన సినిమా ముచ్చట్లు కార్తీ ఏకధాటిగా చెప్పుకుపోతున్నాడు.

Similar News