ఒత్తిడి అంటూ.. అందరికి మొహం చాటేస్తున్నాడట!!

ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న హాట్ టాపిక్. సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులైనప్పటికీ .. నిన్ననే జరిగినట్టుగా.. ఆయన అభిమనులు సోషల్ [more]

Update: 2020-07-10 07:37 GMT

ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న హాట్ టాపిక్. సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులైనప్పటికీ .. నిన్ననే జరిగినట్టుగా.. ఆయన అభిమనులు సోషల్ ఇండియాలో రచ్చ చెయ్యడం, పోలీస్ లు కూడా బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ లో ఎవరో అంటే సుశాంత్ కి సన్నహితంగా ఉన్న వారిని సుశాంత్ మరణం విషయంలో విచారణకు పిలుస్తూ హడావిడి చేస్తూనే ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం బాలీవుడ్ నేపోటీజాన్ని ఎండగడుతూ ఉండడంతో… అలియా భట్, కరణ్ జోహార్, సోనాక్షి లాంటి సెలబ్రిటీస్ సైలెంట్ అయ్యారు. సోనాక్షి లాంటి స్టార్ కిడ్స్ సోషల్ మీడియాని వదిలేస్తే.. కరణ్ జోహార్ లాంటోళ్ళు మౌనాన్ని వీడడం లేదు.

మౌనం మాత్రమే కాదు.. సుశాంత్ మరణముతో తనపై సోషల్ మీడియాలో జరుగుతూన్న ట్రోలింగ్ కి మనోవేదనకు గురవుతున్నాడట కరణ్ జోహార్. కరణ్ డిప్రెషన్ లో ఉన్నట్లుగా  ఆయన సన్నిహితుడు చెబుతున్న మాట. కరణ్ జోహార్ సెలెబ్రిటీస్ పిల్లలని తప్ప మరెవరిని పట్టించుకోడంటూ సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు యుద్ధం చెయ్యడం, కరణ్ జోహార్ ని తీవ్రంగా విమర్శిస్తుండడంతో కరణ్ ఇలా మనోవేదనకు గురవుతున్నాడట. సుశాంత్ మరణం తర్వాత కరణ్ బాగా కుంగిపోయాడని, ఇప్పటికి ఏడుస్తున్నాడని, అందుకే ఎవరిని కలవలేకపోతున్నాడని అంటున్నారు. కానీ సుశాంత్ అభిమనులు మాత్రం కరణ్ ఎవరిని కలవకపోవడానికి కారణం తాను చేసిన తప్పులకి మొహం చూపించలేకపోతున్నాడని, అందుకే ఇలా అంటున్నారు. మరి ఆయనతో సినిమాలు చేసిన వారు కూడా  కరణ్ జోహార్ డిప్రెషన్ తో కంగారు పడుతున్నారట.

Tags:    

Similar News