ఆ తెలుగు హీరోలతో నటించాలనుంది

Update: 2018-12-24 10:02 GMT

బాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో కంగనా రనౌత్ ఒక్కరు. అక్కడ ఆమెకు మామూలు క్రేజ్ కాదు. సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న కంగనా రీసెంట్ గా 'మణికర్ణిక' అనే సినిమా చేసింది. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 శాతం నేనే డైరెక్ట్ చేశా అని చెప్పుకున్న కంగనా... లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ పేరును ప్రస్తావించడం విశేషం. టాలీవుడ్ లో కంగనా పూరీ డైరెక్షన్ లో 'ఏక్ నిరంజన్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కంగనా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..."నేను, ప్రభాస్ కలిసి గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఏక్ నిరంజన్' సినిమా చేశాము. అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ కాదు. 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో మేమిద్దరం ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం’’ అంటూ ప్రభాస్ తో స్నేహాన్ని గుర్తు చేసుకుంది.

మహేష్ తో కూడా నటించాలి...

‘‘మేము ఫ్రెండ్లీగా ఉండడమే కాదు ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్లం. ప్రభాస్ మంచి మనసు ఉన్న వ్యక్తి. 'బాహుబలి' తరువాత ప్రభాస్ ఎదుగుదల చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను మళ్లీ అతనితో సినిమా చేయాలనుకుంటున్నా..ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రభాస్ తోనే కాదు మహేష్ బాబుతో కూడా నటించాలనుకుంటున్నా’’ అని తన మనసులో మాట చెప్పేసింది.

Similar News