కంగనాతో పడలేకపోతున్నారట

Update: 2018-09-30 06:52 GMT

కంగనా ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో మొదలైన మణికర్ణిక సినిమా విషయంలో అనేకానేక మలుపులు రోజురోజుకి తిరుగుతూనే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మొదలైన మణికర్ణిక చివరికి కంగనా డైరెక్షన్ లోకొచ్చింది. కంగనాకు క్రిష్ తో మొదలైన విభేదాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కంగనాకున్న పొగరు బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరికీ లేవంటారు బాలీవుడ్ జనాలు. అసలు నిన్న మణికర్ణిక సినిమా అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే మణికర్ణిక టీజర్ ని అక్టోబర్ 2 న గాంధీ జయంతి కానుకగా విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఇంతలోపే కంగనాతో పడలేక ఈ చిత్రంలో నటించే నటి ఒకరు మణికర్ణిక టీం కి ఝలక్ ఇచ్చి సినిమా నుండి తప్పుకున్నట్టుగా ప్రచారం మొదలైంది.

అసలు ముందు కంగనా రనౌత్ తో విభేదాలతో దర్శకుడు క్రిష్ సైలెంట్ గా తప్పుకుని టాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసాడు. తర్వాత కథలో మార్పులు చేర్పులు చేసిందనే సాకుతో రచయిత విజయేంద్ర ప్రసాద్ మణికర్ణిక నుండి బయటికొచ్చారనే ప్రచారం జరిగింది. తర్వాత కంగనా యాటిట్యూడ్ తట్టుకోలేక.. తనని కించపరుస్తుంది అన్న కారణంతో మాణికర్ణికలో మరాఠా సైన్యాధిపతి అయిన సదాశివరావు కేరెక్టర్ చేసిన సోను సూద్ బయటికి వచ్చేసాడు. బయటికొచ్చేసిన సోను సూద్ రణ్వీర్ సింగ్ తో టెంపర్ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమా నిర్మాత కూడా తప్పుకున్నట్లుగా చెప్పారు. ఇక తాజాగా మణికర్ణిక నుండి మరో వికెట్ పడిందంటున్నారు.

సదాశివరావు భార్యగా నటిస్తున్న స్వాతి అనే నటి కూడా తప్పుకుంది. నటి స్వాతి కూడా మణికర్ణిక సెట్ లో కంగనా డామినేషన్ తట్టుకోలేకే ఈ సినిమా నుండి తప్పుకుందని ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయమై స్వయానా స్వాతి స్పందించింది. నేను సినిమా నుండి తప్పుకుంటున్నా, నా పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయి.. ఈమధ్యే ఆ విషయంపై మీటింగ్ జరిగింది.. మీటింగ్ తర్వాత నా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని అర్థం చేసుకున్నాను. నేను ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు ఇలా లేదు. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది అంటూ మణికర్ణికా నుండి ఆఫీసియల్ గా తప్పుకున్నట్లుగా చెప్పేసింది.

Similar News