మీడియా వారిని నోటికొచ్చినట్లు మాట్లాడిన కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్..ఈపేరు పక్కన కాంట్రవర్సీ యాడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడూ కాంట్రవర్సీ వార్తల్లో ఉండే ఈమె లేటెస్ట్ గా మీడియా వారిని నోటికి [more]

Update: 2019-07-11 07:48 GMT

బాలీవుడ్ నటి కంగనా రనౌత్..ఈపేరు పక్కన కాంట్రవర్సీ యాడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడూ కాంట్రవర్సీ వార్తల్లో ఉండే ఈమె లేటెస్ట్ గా మీడియా వారిని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. రీసెంట్ గా ఆమె ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ కంగనా ఓ ఇంటర్వ్యూ లో ఇలా మాట్లాడింది.

‘మణికర్ణిక’ చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడారు. దాంతో అక్కడ జర్నలిస్టు లు అంత కంగనా తమకు సారీ చెప్పాలని లేకపోతే ఆమెకు మేము కవరేజ్ చేయబోము అంటూ ప్రకటించింది. గొడవ మరి పెద్దది అవ్వడంతో చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది కానీ కంగనా సారీ చెప్పలేదు. అక్కడితో కంగనా రనౌత్ ఆగలేదు. మీడియాను దుర్భాషలాడుతూ వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియో లో…’ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని మేము ఏ విధంగా జర్నలిస్టులని పిలవాలి? నన్ను మీరు బాన్ చేయడం కాదు నేను అడుగుతున్న నన్ను బాన్ చేయమని. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు డబ్బులు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?’ అని గట్టిగా మీడియా వారిపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఒకవేళ నిజంగానే మీడియా వారు కంగనా రనౌత్ ను కవరేజ్ చేయకపోతే ఆమె పరిస్థితి ఏంటి?

Tags:    

Similar News