మళ్లీ విశ్వరూపం చూపనున్న కమల్

Update: 2018-06-09 10:25 GMT

హమ్మయ్య ఎట్టకేలకు కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం 2' రిలీజ్ అవ్వబోతుంది. 'విశ్వరూపం' 2013 లో వచ్చింది. మళ్లీ దాదాపుగా దాని సీక్వెల్ రావడానికి ఐదేళ్లు పట్టింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్, కొన్ని సమస్యల వల్ల విడుదల డిలే అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ కోసం ముహూర్తం పెట్టేశాడు నటుడు కమల్. జూన్ 11న అంటే, ఈ సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలుగు వెర్షన్ తో పాటు హిందీ, తమిళ్ వెర్షన్స్ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ లాంచ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నాడు. పెద్ద సెలెబ్రెటీస్ తోనే ఈ ట్రైలర్ లాంచ్ చేయిస్తున్నాడు కమల్ హాసన్. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, తమిళంలో శృతి‌హాసన్, బాలీవుడ్‌లో ఆమీర్‌ఖాన్ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.

ఫ్యాన్స్ కు శుభవార్తే....

ప్రస్తుతం పొలిటికల్ పార్టీ పెట్టి బిజీగా ఉన్న కమల్... ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం తన ఫ్యాన్స్ కు శుభవార్తే. ఎన్నో ఇబ్బందుల మధ్య, ఒకానొక దశలో 'విశ్వరూపం 2' రావడం కష్టమనే వార్తలొచ్చాయి. కానీ అన్ని అడ్డంకులను అధిగమించాడు కమల్. ఫస్ట్ పార్ట్ లానే సెకండ్ పార్ట్ కూడా అదే ఊపు కొనసాగిస్తే కమల్ పంట పండినట్లే! ఇక ఈ సినిమాలో ఆండ్రియా, రాహుల్‌ బోస్, పూజా‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Similar News