కమల్ షాకింగ్ డెసిషన్..!

Update: 2018-12-05 11:32 GMT

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే నటనకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. రీసెంట్ గా ఆయన తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ చేయనున్నాడు కమల్. ఈ సినిమా తరువాత చిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించాడు. ఇదే లాస్ట్ సినిమా అని పేర్కొన్నారు.

రాజకీయాలతో సంబంధం లేని సినిమా

వచ్చే నెల 14 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని, ఈ సినిమా తరువాత సినిమాల నుండి తప్పుకుని తన పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్టు కమల్ వివరించారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కమల్ కు రాజకీయ ఎంట్రీ కి బూస్ట్ ఇచ్చే సినిమా అవుతుందని కోలీవుడ్ సమాచారం. కానీ పాలిటిక్స్ కి, ఈ సినిమాకు సంబంధం లేదని డైరెక్టర్ శంకర్ చెప్పారు. కమల్ సడన్ డెసిషన్ వల్ల తన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. ఎలెక్షన్స్ కన్నా ముందే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.

Similar News