కాజల్ కు బంపర్ ఆఫర్ తగిలింది..!

Update: 2018-10-29 07:12 GMT

సీనియర్ హీరోయిన్ అయిన కాజల్ కు టాలీవుడ్ లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. గత ఏడాది చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైది నెంబర్ 150' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ఆ తరువాత తేజ డైరెక్షన్ లో రానాకు జోడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ అందుకుంది. మళ్లీ ఇప్పుడు తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ సరసన ప్రస్తుతం నటిస్తుంది. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది.

కమల్ సరసన కూడా...

రోబో 2.ఓ తరువాత శంకర్.. కమల్ హాసన్ తో 'భారతీయుడు' సీక్వెల్ తీయనున్నాడని తెలిసిన విషయమే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఫైనలైజ్ చేశారట. అయితే ఇందులో కమల్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. మరి కాజల్ పెద్ద కమల్ హాసన్ కు జోడీగా నా లేదా యంగ్ కమల్ క్యారక్టర్ కు జతగానా అన్నది క్లారిటీ లేదు. ఏది ఏమైనా కాజల్ కు ఇది క్రేజీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయి అంట. కాజల్ ఇలా ఒకేసారి యంగ్ హీరోల పక్కన..సీనియర్స్ హీరోల పక్కన నటించే అవకాశం రావడం మాములు విషయం కాదు. ఇటువంటి ఛాన్స్ లు రావడం అదృష్టమే అని చెప్పుకోవాలి. కెరీర్ పరంగా కాజల్ భలే ప్లాన్ వేసుకుంటుంది. త్వరలోనే 'భారతీయుడు' సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Similar News