కాజల్ కల నెరవేరబోతుంది..!

Update: 2018-11-06 08:02 GMT

సౌత్ హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ కి చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించాలని ఉండదు చెప్పండి..! అలానే రాజమౌళి, శంకర్, మణిరత్నం లాంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి..! కరెక్ట్ గా అటువంటి లక్ష్యాల్ని కొన్ని సాధించింది హీరోయిన్ కాజల్. రాజమౌళితో 'మగధీర', చిరంజీవి తో 'ఖైదీ నెంబర్ 150 ' లో నటించింది. అయితే మరోసారి ఆమెకు ఓ స్టార్ డైరెక్టర్ తో పాటు స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

మంచి ఛాన్స్ కొట్టేసిన కాజల్

తాజాగా ఆమె కమల్ హాసన్, శంకర్‌లతో ఒకేసారి వర్క్ చేసే ఛాన్స్ కొట్టేసిందంటూ కొన్ని రోజుల నుండి టాక్ నడుస్తుంది. అయితే ఇందులో నిజం లేదని చాలా మంది అన్నారు. కానీ ఇది నిజం అని కాజల్ స్వయంగా ధ్రువీకరించడం విశేషం. కమల్ హాసన్, శంకర్ లతో కలిసి ఒకేసారి వర్క్ చేసే ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని కాజల్ ఓ మీడియా సంస్థతో చెప్పడం విశేషం. ఆమె ‘భారతీయుడు-2’లో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. చాలామంది హీరోయిన్స్ తరువాత కాజల్ ని సలెక్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్.

2.ఓ విడుదల తర్వాత...

శంకర్ ప్రస్తుతం ‘2.0’ విడుదల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత శంకర్ ‘భారతీయుడు-2’ను సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది. రెండు దశాబ్దాల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Similar News