అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

తన మొదటి సినిమా ‘అ!’ తోనే విమర్శల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈసినిమాకి సీక్వెల్ గా మరో సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా ఈచిత్రం [more]

Update: 2019-08-18 07:19 GMT

తన మొదటి సినిమా ‘అ!’ తోనే విమర్శల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈసినిమాకి సీక్వెల్ గా మరో సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా ఈచిత్రం కి రెండు జాతీయ అవార్డులు రావడంతో మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఇదే ఊపుతో ప్రశాంత్ వర్మ ‘అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసేశాడు.

ఈ సీక్వెల్ ప్రధాన పాత్రలో కాజల్ అగర్వాల్ నటించ నుంది. మరో ముఖ్య పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారు. రీసెంట్ గా కాజల్ కి ఈమూవీ కథ చెపితే ఓకే అన్నారు అని కానీ ఆమె ఇంకా ఈ సినిమాకు సంతకం చేయలేదని చెప్పాడు ప్రశాంత్. అయితే ఈ మూవీ ‘అ!’ సినిమాకు కొనసాగింపు లాగా ఉండదట. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రశాంత్ అంటున్నాడు.

ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. ‘అ!’లో మాదిరి ఇందులో మల్టిపుల్ స్టోరీస్ ఉండవని.. ఒకే కథ ఉంటుందని.. అది ప్రేక్షకుల అంచనాలకు అందని రీతిలో సాగుతుందని అన్నాడు ప్రశాంత్. ఒకవేళ విజయ్ అండ్ కాజల్ అగర్వాల్ ఇద్దరు ఒప్పుకుంటే త్వరలోనే ఈసినిమా స్టార్ట్ చేస్తానని చెప్పాడు ప్రశాంత్ వర్మ.

Tags:    

Similar News