అతను అలాంటివారు కాదన్న కైరా అద్వానీ

Update: 2018-07-18 08:46 GMT

డీవీవీ దానయ్య నిర్మాణంలో మహేష్ బాబు-కైరా అద్వానీ జంటగా కొరటాల శివ రూపొందించిన ‘భరత్ అనే నేను’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, చిత్రం విజయం సాధించినా, కలెక్షన్లు బాగానే వసూలు చేసినా దర్శకుడు కొరటాల శివకు, హీరోయిన్ కైరా అద్వానీకి పారితోషకం పూర్తిగా ఇవ్వకుండా నిర్మాత దానయ్య ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు రెండుమూడు రోజులుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై దానయ్య సైతం స్పందించి తాను అందరికీ పారితోషకం చెల్లించానని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మరి ఇంకో సినిమా ఎందుకు చేస్తా..?

ఇక తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ కైరా అద్వానీ కూడా స్పందించారు. తనకు రావాల్సిన పూర్తి పారితోషకాన్ని నిర్మాత దానయ్య చేల్లించారని ఆమే స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ నిర్మాతగా, నిర్మాణ సంస్థగా పేరున్న డీవీవీ దానయ్యపై, డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పై ఇటువంటి నిరాధార వార్తలు రాయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమైతే తన తర్వాతి చిత్రం మళ్లీ డీవీవీ దానయ్య నిర్మాణంలోనే ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. కైరా అద్వానీ తర్వాతి చిత్రం రాంచరణ్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చేస్తోంది.

Similar News