మతి పోగొడుతున్న సీఎం గర్ల్ ఫ్రెండ్..!

సాదరణంగా సౌత్ హీరోయిన్స్ యూత్ తో పాటు దర్శక నిర్మాతల కన్నుల్లో పడాలంటే గ్లామర్ డోస్ ఎక్కువ ఉన్న పాత్రలు చేస్తుంటారు. లేకపోతే గ్లామర్ ఫోటో షూట్స్ [more]

Update: 2019-01-01 07:11 GMT

సాదరణంగా సౌత్ హీరోయిన్స్ యూత్ తో పాటు దర్శక నిర్మాతల కన్నుల్లో పడాలంటే గ్లామర్ డోస్ ఎక్కువ ఉన్న పాత్రలు చేస్తుంటారు. లేకపోతే గ్లామర్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంటారు. అయితే ఈ భామల సంఖ్య రోజురోజుకి మన సౌత్ లో పెరిగిపోతుంది. సౌత్ హీరోయిన్స్ ఇలా చేయడానికి మరో కారణం ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాలన్న కోరికతో ఇలా చేస్తుంటారు. అయితే బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన ఓ భామ అవకాశాలు అందుకున్నప్పటికీ గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ లో నటించిన కైరా అద్వానీ.

పెద్ద అవకాశాల కోసమేనా..?

కైరా కు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. రీసెంట్ గా ఈమె రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ లో కూడా నటించింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే కైరా గత మూడు రోజుల నుండి తన సోయగాలను అందరితో పంచుకుంటూ రచ్చ చేస్తోంది. ఏకంగా టూ పీస్ బికినీల్లో ఫోజులిచ్చి యూత్ మతులు పోగొడుతుంది. ఆ ఫొటోస్ అన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. బహుశా బాలీవుడ్ నుండి బిగ్ ఫిలిమ్స్ దక్కాలని ఈ రూట్ లో ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు అక్కడి ఫిలిం సర్కిల్స్.

Tags:    

Similar News