రజిని భార్యకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి!

Update: 2018-06-12 03:26 GMT

'కాలా' సినిమాలో రజినీకి భార్యగా నటించిన ఈశ్వరి రావు నటన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆమె మన తెలుగు అమ్మాయే. గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా బాపు గారి దర్శకత్వంలో 'రాంబంటు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కనుమరుగైపోయింది.

మళ్లీ చాలా కాలం తర్వాత రవితేజ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'భద్ర'లో ప్రకాష్ రాజ్ భార్యగా నటించగా... ఆ తర్వాత మళ్లీ లేటెస్ట్ గా నాని మూవీ 'నేను లోకల్' లో పోసాని కృష్ణ మురళికి భార్య గా నటించింది. ఆ సినిమాలో ఆమె నటన పర్లేదు అనిపించుకున్న ఇప్పుడు 'కాలా'లో పెద్ద బ్రేకే దొరికింది. 'కాలా' సినిమా ప్లాప్ అయిన ఆమెకు మాత్రం మంచి పేరు వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమెకు ఆఫర్స్ వరిస్తున్నాయి.

విక్రమ్ కొడుకు హీరోగా తమిళ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'వర్మ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. వైవిధ్యమైన దర్శకుడు బాలా తీస్తున్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఈశ్వరి రావును తీసుకున్నారు. అయితే మరి అందులో ఏ పాత్ర అనేది బయటికి చెప్పడం లేదు. అందులో ఫిమేల్ రోల్ అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేవు. మరి ఆమె ఏ పాత్ర చేస్తుందో తెలియాలి. కానీ తమిళ్ వెర్షన్ 'వర్మ'లో చాలా మార్పులు చేసిన కారణంగానే ఈశ్వరి రావుకు మంచి పాత్ర దొరికినట్టు సమాచారం.

Similar News