విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ..!

Update: 2018-10-05 06:41 GMT

తెలుగు అమ్మాయి అయిన శ్రీదేవి ఇక్కడ చాలా సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ అయ్యి బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఇక్కడ నుండి అక్కడికి వెళ్లి అగ్ర కథానాయికగా వెలిగింది. అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిన శ్రీదేవి పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించింది. తన కూతురు జాన్వీ కపూర్ హిందీలో 'ధఢక్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది షూటింగ్ దశలో ఉండగానే శ్రీదేవి చనిపోయింది. తెలుగులో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీదేవి అదేవిధంగా తన కూతురు జాన్వీ కపూర్‌ ఇక్కడి సినిమాలు చేయాలని భావిస్తుందని మన వాళ్లు నమ్ముతున్నారు.

ప్రస్తుతానికి బాలీవుడ్ లోనే...

కానీ తనకి తెలుగులో ఇప్పుడే నటించే ఆలోచన లేదని జాన్వీ కపూర్ స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండ సినిమాలో చేస్తుంది అని ఆ మధ్య వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇస్తూ.. విజయ్‌తోనే కాదు, ఎవరితోను తెలుగు సినిమా చేయడం లేదని చెప్పింది. ఆఫర్స్ వస్తున్నా అవి రిజెక్ట్ చేస్తున్నానని.. ప్రస్తుతం నా దృష్టి మొత్తం బాలీవుడ్ లో ఎదగడం మీదే పెట్టానని చెప్పింది. బాలీవుడ్ లో ఈమెను అగ్ర కథానాయకగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్‌ జోహార్‌. త్వరలోనే తన దర్శకత్వంలో తీసే ఒక భారీ సినిమాలో జాన్వీకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఈ లోపు తనకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ నటిగా తనదైన ముద్ర సొంతం చేసుకోమని సలహా ఇచ్చాడట.

Similar News