జాన్వీ కపూర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా?

Update: 2018-07-03 07:20 GMT

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాను సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. బోల్డ్ సినిమాల్లో ఒరవడి సృష్టించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ - షాలిని పాండే నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ దశదిశాని మార్చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా సందీప్ దర్శకత్వం వహించటం విశేషం. ఇక ఈ సినిమాలో షాహిద్ కపూర్ - తార సుతారియా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కరణ్ చెప్పినందుకే...

రీసెంట్ గా సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను అనుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం జాన్వీ ను అడగగా నో చెప్పేసిందట. అందుకు కారణం నిర్మాత కరణ్ జోహార్ అని తెలుస్తుంది. శ్రీదేవి ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన కరణ్.. బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కరెక్ట్ కాదని..అది ఎంతమాత్రం మంచి ఆప్షన్ కాదని జాన్వీ కు కరణ్ సూచించాడట.కరణ్ జోహార్ చెప్పటంతో జాన్వీ కూడా నో చెప్పిందంట. సో దాంతో తార సుతారియాను ఈ సినిమాలో తీసుకున్నారంట. ప్రస్తుతం జాన్వీ నటించిన మొదటి సినిమా 'ధఢక్' ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సైరట్ సినిమాకు రీమేక్. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Similar News