జబర్దస్త్ వద్దనుకున్నా సీనియర్ హీరోయిన్

ఈటీవీ లో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’ కామెడీ షో .. ఎంతో పాప్యులర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ప్రతి గురు, శుక్రు వారాల్లో వచ్చే ఈ కామెడీ [more]

Update: 2019-04-14 10:25 GMT

ఈటీవీ లో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’ కామెడీ షో .. ఎంతో పాప్యులర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ప్రతి గురు, శుక్రు వారాల్లో వచ్చే ఈ కామెడీ షో మంచి రేటింగ్స్ వస్తుంటాయి. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా నాగబాబు అండ్ రోజా వ్యవహరించే వాళ్ళు.
అయితే ఇద్దరూ తమ తమ పార్టీలకి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. ఎలక్షన్స్ సమయం కాబట్టి ఇద్దరూ పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రచారం కోసం కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. సో అందు కోసం ఈ కామెడీ షో నిర్వాహకులు .. క్రేజ్ వున్న సీనియర్ ఆర్టిస్టులను న్యాయనిర్ణేతలుగా తీసుకునేందుకు వాళ్లతో సంప్రదింపులు జరిపారట. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ జయసుధను కూడా సంప్రదించారు. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన జయసుధ ఆ తరువాత మదర్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సహజనటి అనే పేరు కూడా ఉంది. రీ ఎంట్రీలో ఆమె తన వయసుకి తగిన హుందాతనంతో కూడిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఆ కారణంగానే ఈ కామెడీ షోకి సెట్ కాదని ఆమె సున్నితంగా తిరస్కరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. జయసుధ ప్లేస్ లో మీనా చేస్తుంది. నాగబాబు ప్లేస్ లో శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా చేస్తున్నారు.

Tags:    

Similar News