జయం రవి రెడీ..చరణ్ రెడీయేనా..?

Update: 2018-12-24 06:47 GMT

తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఒరువన్‌' మూవీని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి సక్సెస్ అయ్యాడు. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి చాలామంది జంకారు. విలన్ రోల్ డామినేటింగ్ గా ఉండడంతో ఆ చిత్రాన్ని తెలుగులో చేయడానికి ఎవరూ సాహసించ లేదు. కానీ రామ్ చరణ్ ఒక అడుగు ముందుకేసి ‘ధృవ’ పేరుతో ఈ చిత్రం చేసాడు. తమిళంలో ఎంత విజయం సాధించిందో తెలుగులో కూడా అంతే విజయం సాధించింది. చరణ్ నటనలో మరో కోణాన్ని చూపించింది ఈ మూవీ. అయితే తమిళంలో ఇప్పుడు 'తని ఒరువన్‌'కి సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో జయం రవి, జయం రాజా ఉన్నారు.

త్వరలోనే సెట్స్ మీదకు సీక్వెల్

ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని టాక్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తెలుగు లో కూడా 'ధృవ'కి సీక్వెల్ చేస్తారా..? ఒకవేళ చేసినా చరణ్ హీరోగా చేస్తాడా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 'తని ఒరువన్‌' సీక్వెల్‌ స్టోరీ బాగుంటే చేసే అవకాశం ఉందని చెబుతున్నారు చరణ్ సన్నిహితులు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాలతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Similar News