తల్లి కోరికను తీర్చే టైం వచ్చేసింది!

Update: 2018-04-23 03:03 GMT

జాన్వీ కపూర్ తన తల్లి చనిపోయిన బాధ నుండి తొందరగానే కోలుకుంది. తన తల్లి మరణ వార్తను తట్టుకుని నిలబడి తన తల్లి చూపిన దారిలో తన పనులు చేసుకు పోతుంది. ఎప్పుడూ తల్లి సంరక్షణలో ఉన్న జాన్వీ కపూర్ ఉన్నటుంది ఒంటరి అయింది. కాదు ఇప్పుడు జాన్వీ కపూర్ బాధ్యతలను తన తండ్రి బోని కపూర్ తో పాటు ఆయన కొడుకు అర్జున్ కపూర్ తీసుకున్నారు. తనకి శ్రీదేవి అంటే ఇష్టం లేకపోయినా.. ఆమె కాలం చేసాక ఆమె కూతుళ్ళని అర్జున్ కపూర్ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.

ప్రస్తుతం తన తల్లి బ్రతికున్నపుడు.. వెండితెర మీద అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ సంరక్షణలో మరాఠీలో ఘన విజయం సాధించిన ‘సైరత్’ చిత్రాన్ని బాలీవుడ్‌లో 'ధఢక్' అనే పేరుతొ రీమేక్ చేశారు. ఇషాన్ కట్తర్ హీరోగా జాన్వీ కపూర్ తొలిసారి వెండితెర మీద మెరవనుంది. తన తల్లి మరణించేనాటికి సెట్స్ మీదున్న 'ధఢక్' చిత్ర షూటింగ్ నిన్నటితో పూర్తయ్యింది. శ్రీదేవి తన కూతుర్ని వెండితెర మీద చూడాలని కలలు కనింది. కానీ ఆమె కోరిక తీరకముందే ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ తన తల్లి కోరికను పూర్తి చెయ్యడానికి జాన్వీ కపూర్ కష్టపడింది. అందుకే 'ధఢక్ 'చిత్ర షూటింగ్ అనుకున్న టైం అనుకున్నట్టుగా పూర్తి చేశారు.

ప్రస్తుతం బయటికొచ్చిన 'ధఢక్' చిత్ర ఫొటోస్ జాన్వీ కపూర్ క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను చిత్ర బృందం చిన్నపాటి పార్టీ కూడా చేసుకుంది. ఆ పార్టీకి ధఢక్ డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ తో పాటుగా జాన్వీ తండ్రి బోనికపూర్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చిత్ర బృందం సమాయత్తమవుతోంది. ఇకపోతే జాన్వీ - ఇషాన్ ల చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News