ఏడాది గ్యాప్ తరువాత ఈ బ్యూటీ ప్రభాస్ తో స్టెప్ వేయనుంది

పుట్టింది శ్రీలంక లో అయిన బాలీవుడ్ ఫేమస్ అయింది నటి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. ఈమె తెరపై కనిపించి దాదాపు ఏడాది కావొస్తుంది. ఏడాది క్రితం సల్మాన్‌ఖాన్‌ ‘రేస్‌ [more]

Update: 2019-07-05 04:52 GMT

పుట్టింది శ్రీలంక లో అయిన బాలీవుడ్ ఫేమస్ అయింది నటి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. ఈమె తెరపై కనిపించి దాదాపు ఏడాది కావొస్తుంది. ఏడాది క్రితం సల్మాన్‌ఖాన్‌ ‘రేస్‌ 3’లో ఆడిపాడింది. ఇప్పుడు మరోసారి ఆడిపాడనుంది. అది కూడ తెలుగు సినిమాకి. అవును ఇప్పుడు ఈ అందాల తార సాహో చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ప్రభాస్‌తో కలిసి చిందేసిందంటున్నాయి బాలీవుడ్‌ మీడియా వారు.

ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది. అక్కడే జాక్వెలైన్‌ కూడా ఉంది. అక్కడ ప్రభాస్ తో ఓ సాంగ్ లో పాల్గొంది. బాద్‌షా ఆలపించిన ఈ గీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆస్ట్రియాలోనే నటి శ్రద్ధాకపూర్‌ కూడా ఉంది అక్కడే మరో సాంగ్ ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ పైన చిత్రకరించనున్నారు.

యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ‘సాహో’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.

Tags:    

Similar News