పూరి అండ్ ఛార్మి లకి భయంగా ఉందట

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు నిర్మాతలు పూరి అండ్ ఛార్మి. ఈ సినిమా హిట్ తో ఒక్కసారిగా లైం లైట్ లోకి [more]

Update: 2019-10-07 07:56 GMT

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు నిర్మాతలు పూరి అండ్ ఛార్మి. ఈ సినిమా హిట్ తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చారు. సినిమాకి భారీగా ప్రాఫిట్స్ రావడంతో హ్యాపీగా చెరొక కారు కొనుక్కుని అన్ని సెటిల్ మెంట్స్ క్లోజ్ చేసేశారు ఇద్దరూ. వీరిద్దరికి ఇప్పుడు మరో సమస్య ఉంది. అదే ‘రొమాంటిక్’ రూపంలో. పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న రొమాంటిక్ చిత్రంకి పూరి చార్మీ నిర్మాతలన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరికి మళ్ళీ భయం పుట్టిస్తుంది. ఆకాష్ హీరోగా పూరి డైరెక్టర్ గా ‘మెహబూబా’ అనే సినిమా చేశారు. కానీ అది డిజాస్టర్ అయింది. దాంతో ఈ సినిమా ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నిండా మునిగారు. ఆ నష్టాలని కవర్ చేయడానికి పూరి ఛార్మి లకి చాలా టైం పట్టింది.

లాభాలోస్తాయా….?

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో రొమాంటిక్ సినిమాని లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ మూవీని అడల్ట్ కంటెంట్ తో బజ్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే హీరోయిన్ టాప్ లెస్ తో ఉండగా హీరో హాగ్ చేసుకునే స్టిల్ ను ఫస్ట్ లుక్ గా వదిలారట. టైటిల్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారని తెలుస్తుంది. మరి ఈ సినిమా తో కూడా పూరి అండ్ చార్మీ నిర్మాతలుగా ఈ సినిమాతో లాభాలు చూస్తారా ? లేదో చూద్దాం.

 

Tags:    

Similar News