పూరి- ఛార్మీలకు షాకిచ్చిన ఇస్మార్ట్ గర్ల్స్?

పూరి జగన్నాధ్ – ఛార్మి కలిపి జాయింట్ గా పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి.. దాని ద్వారా హీరోయిన్స్ ని టాలీవుడ్ కి [more]

Update: 2020-06-05 05:06 GMT

పూరి జగన్నాధ్ – ఛార్మి కలిపి జాయింట్ గా పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి.. దాని ద్వారా హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. అందులో కొంతమంది క్లిక్ అయితే మరికొంతమంది అడ్రస్ లేకుండా పోతున్నారు. అయితే గత ఏడాది రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని చేసిన పూరి అండ్ ఛార్మి లు నిధి అగర్వాల్ – నాభ నటేష్ ని హీరోయిన్స్ గా ఫైనల్ చేసి హాట్ హాట్ గ్లామర్ గా వాళ్ళని చూపించి వాళ్ళని. ఇస్మార్ట్ హిట్ లో భాగం చేసారు. దానితో వారికీ బాగా క్రేజ్ వచ్చేసింది. ఇక ఛార్మి – పూరి పూరి కనెక్ట్స్ కి ఫిదా అయ్యి… నాభ నటేష్ – నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ ద్వారా ఫెమస్ అవుదామని ఒప్పందం చేసుకున్నారట.

ఇస్మార్ట్ శంకర్ హిట్ కి ముందు నిధి కి కానీ, నాభ కి కానీ పెద్ద హిట్స్ అయితే లేవు. ఇస్మార్ట్ హిట్ అందుకున్నాక పూరి కనెక్ట్స్ లో జాయిన్ అయ్యి.. వారి ద్వారా అవకాశాలు అందిపుచ్చుకుందామని పూరి ఇంకా ఛార్మి లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే తాజాగా నాభ నటేష్, నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ నుండి బయటికొచ్చినట్టుగా ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. నిధి అగర్వాల్ రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న క్వీన్ తో ఒప్పందం చేసుకుందని… అలాగే నాభ నటేష్ కూడా ఓ మేనేజర్ ని పెట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళకి మేనేజర్ గా వ్యవహరించిన హరినాథ్ ద్వారా నాభ అవకాశాలు వెతుక్కుంటుందట. మరి ఇస్మార్ట్ హిట్ తర్వాత నాభ కి, నిధి కెరీర్ కానీ ఓ వెలుగు వెలగలేదు. చిన్న చిన్న అవకాశాలతోనే సర్దుకోవాల్సి రావడంతోనే నిధి, నాభ లు ఇలా పూరి కి, ఛార్మికి షాకిచ్చారని చెబుతున్నారు.

Tags:    

Similar News