మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన ఐషు

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్స్ తీసినా మణిరత్నం గత కొంత కాలంనుండి తను తీసినా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో అతను ఏమి కుంగిపోలేదు. అతని నుండి ఎప్పటికప్పుడు [more]

Update: 2019-05-26 07:53 GMT

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్స్ తీసినా మణిరత్నం గత కొంత కాలంనుండి తను తీసినా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో అతను ఏమి కుంగిపోలేదు. అతని నుండి ఎప్పటికప్పుడు ట్రెండీగానే సినిమాలు వస్తూనే ఉన్నాయి. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమి అంతగా ఆడకపోయినా ట్రెండీగా అనిపిస్తాయి. అందుకే మణిరత్నం సినిమాలంటే ఇప్పటికి యూత్ లో క్రేజ్ ఉంటది.

అలానే మణి తో సినిమాలు చేయడానికి ఇప్పటికీ నటీనటులు, టెక్నీషియన్లు ఎగ్జైట్ అవుతారు. ఆయనతో నటించాలని చాలామంది అనుకోవడం విశేషం. ప్రస్తుతం ఈయన తన డ్రీం ప్రాజెక్ట్ ను తెరకెక్కించే పనిలోకి ఉన్నాడు. ఇందులో నటించడానికి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్, మోహన్ బాబు సహా చాలామంది పెద్ద నటీనటులు ముందుకు వచ్చారు. ఇది తమిళంలో ప్రసిద్ధి పొందిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా రూపొందుతుంది.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అలానే ఇందులో నటించే నటీనటులు కూడా ఈమూవీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ రీసెంట్ గా ఐశ్వర్యారాయ్ ఈమూవీ గురించి నోరు విప్పింది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన ఐశ్వర్యకు ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రశ్న ఎదురైంది. నేను మణిరత్నం మూవీలో నటిస్తున్నానని..ఈమూవీ గురించి నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన రాకముందే మాట్లాడటం బాగోదని అందుకే ఇప్పటిదాకా దీని గురించి మాట్లేదని చెప్పింది.

మణిరత్నంతో సినిమా చేయడానికి ఎప్పుడైనా సిద్ధమని.. ఆయన తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని..ఆయన తో మరోసారి సినిమా చేయడం సంతోషం అని చెప్పుకొచ్చింది. ఈమూవీ తనది వైవిధ్యమైన పాత్ర అని చెప్పింది. ఇందులో ఆమెది నెగటివ్ రోల్ ఉన్న పాత్ర.

Tags:    

Similar News