ఎన్టీఆర్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Update: 2018-10-28 08:57 GMT

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. ఇందులో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా..బసవతారకం పాత్రలో విద్య బాలన్ ....చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కి బదులు నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని సినిమాలకు సంబంధించి.....

ఎన్టీఆర్ - సావిత్రిలు చాలా సినిమాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని క్లాసిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి వాటిలో 'మాయాబజార్', 'మిస్సమ్మ' ఉన్నాయి. అయితే ఈచిత్రాలకు సంబంధించి షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు క్రిష్. వాటికీ సంబంధించి సీన్స్ కూడా ఆల్రెడీ షూట్ చేసినట్టు సమాచారం. ఓ కాల్ససికాల్ సాంగ్ కూడా నిత్యామీనన్ - బాలకృష్ణల మధ్య చిత్రీకరించినట్టు తెలుస్తుంది.

నిత్యామీనన్.....

ఇది ఇలా ఉండగా తాజా సమాచారం ప్రకారం నిత్యామీనన్ ఈచిత్రాన్ని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనుందని సమాచారం. నిత్యామీనన్ తెలుగులో మొదటి సినిమా నుండి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కలవాటు. అలానే ఈసినిమాలో కూడా డబ్బింగ్ చెప్పుకుంటుందని టాక్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రం మొదటి పార్టు ‘కథానాయకుడు’ జనవరి 9న...రెండో పార్టు ‘మహానాయకుడు’ జనవరి 24న విడుదల చేయనున్నారు.

Similar News