గీత ఆర్ట్స్ పై దాడులు ?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారాని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది ప్రతి ఏడాది [more]

Update: 2019-03-09 05:35 GMT

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారాని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది ప్రతి ఏడాది జరిగేదే అయినా నిన్న రాత్రి సడన్ గా అధికారాలు దాడులు చేసారని సమాచారం. అయితే ఇలా దాడులు చేస్తున్నారు అన్న విషయం బయటకి రాగానే చాలామంది నిర్మాతలు జాగ్రత్తపడ్డారని సమాచారం.

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ గీతా ఆర్ట్స్ వారికి గీత గోవిందం, టాక్సీవాలా రూపం లో రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈనేపధ్యంలో ఆ సినిమా కలెక్షన్స్ ఎంతవరకు నిజం అనేదానిపై అధికారాలు దాడులు చేసినట్టు సమాచారం. అయితే అసలు నిజంగానే దాడులు జరిగాయో లేదో అన్న విషయం పై క్లారిటీ లేదు. గీత ఆర్ట్స్ ఆఫీస్ తో పాటు ఇంకొన్ని ఆఫీస్ ల పై కూడా దాదులు చేసినట్టు సమాచారం. మరి దీనిపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News