త్రివిక్రమ్ చెబితేనే బాలీవుడ్ కి వెళ్లిందట..!

Update: 2018-11-12 08:29 GMT

'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందరి మనసులు దోచుకున్న ఇలియానా చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆలా మంచి ఊపు మీద ఉన్న ఇలియానా సడన్ గా బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అటు వెళ్లాక ఇటు తిరిగి చూడలేదు. దాదాపు ఆరేళ్ల పాటు పూర్తిగా బాలీవుడ్ కే అంకితం అయిన ఇలియానా లేటెస్ట్ లో రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...

త్రివిక్రమ్ సలహా తీసుకుని వెళ్లా...

"తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు 'జులాయి' సినిమా చేస్తున్నప్పుడు నాకు బాలీవుడ్ నుండి 'బర్ఫీ'లో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఆ టైంలో నేను త్రివిక్రమ్ ని సలహా అడిగాను. ఆయన వెంటనే ఇటువంటి మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకంటూ ప్రోత్సహించారు. ఆలా నేను బాలీవుడ్ కి వెళ్లాను. అక్కడ ‘బర్ఫీ’ లో నటించాను. ఈ సినిమా కథ చాలా గొప్పది. ఇటువంటి కథ నేను ఎప్పుడు వినలేదు. సో వెంటనే నేను ఏమి ఆలోచినకుండా ఆ సినిమాను ఓకే చేసేశాను. ఆలా ఒక్క సినిమా కోసం వెళ్తే వరసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి.

టాలీవుడ్ ను వదులుకోలేదు...

ఆలా నేను బాలీవుడ్ లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. కానీ నేను టాలీవుడ్ ను వదులుకోవాలి అనుకోలేదు. నేను తెలుగు ఇండస్ట్రీని దూరం పెడుతున్న అని సోషల్ మీడియాలో వార్తలు ఎందుకు వచ్చాయో అర్ధం కాలేదు. నేను హిందీలో నటిస్తున్నప్పుడు తెలుగు నుండి ఆఫర్స్ వచ్చాయని... కానీ కొన్ని నాకు డేట్స్ కుదరక..కొన్ని స్టోరీస్ నచ్చక చేయలేదు అని చెప్పింది . ఆ మధ్య ఓ పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ గా అడిగారు. కానీ అందులో నాది చాలా చిన్న పాత్ర అవ్వడంతో ఆ సినిమా చేయను చెప్పేసాను అని చెప్పుకొచ్చింది". అయితే ఆ హీరో ఎవరో..? ఆ సినిమా ఏంటో మాత్రం చెప్పలేదు.

Similar News