నీ కోసం చచ్చిపోతా?

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా గురింపు తెచ్చుకోవడానికి ఎంతగా కష్టపడిందో ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె కథ విన్నాక ఆమెని అభిమానించే అభిమానులు [more]

Update: 2020-06-13 06:14 GMT

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా గురింపు తెచ్చుకోవడానికి ఎంతగా కష్టపడిందో ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె కథ విన్నాక ఆమెని అభిమానించే అభిమానులు ఎక్కువయ్యారు. చామన ఛాయ తోనే ఆకట్టుకునే కళ్ళతో ఐశ్వర్య రాజేష్ గుర్తింపునిచ్చేకేరెక్టర్స్ తో దూసుకుపోతుంది. తాజాగా సోషల్ ఇండియాలో ఐశ్వర్య రాజేష్ ఓ పిక్ పెట్టింది. ఆ పిక్ చూసిన ఆమె అభిమానులు, నెటిజెన్స్, ఆఖరుకి హీరోయిన్ త్రిష కూడా లైక్ చెయ్యగా.. ఆ పిక్ కింద బోలెడన్ని కామెంట్స్ కూడా అవచ్చాయి.

ఆ కామెంట్స్ లో ఐష్ నీ కోసం చచ్చిపోతా.. నీ నటన అంటే పిచ్చి, మీ కోసం నా ప్రణాలిచ్చేస్తా.. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్కా అని ఓ నెటిజెన్ కామెంట్ చెయ్యగా.. దానికి ఐశ్వర్య కాస్త ఎమోషన్ అయ్యింది. నను అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ అలాంటి మాటలు మాటలు మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీ గా ఉన్నవని చెబితే అదే చాలు. ఓ మనిషి కోసం చనిపోవడానికి కాదు మనం జీవించేది. నేనెప్పుడు నీకు మంచి ఫ్రెండ్ గానే ఉంటాను.. ఇంకెప్పుడు ఇలా చచ్చిపోతా.. ప్రణాలిచ్చేస్తా అని మాట్లాడొద్దు అంటూ సున్నితమైన వార్నింగ్ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. 

Tags:    

Similar News