ప్రభాస్ రేంజ్ కి బాలీవుడ్ దాసోహం!!

ప్రభాస్ కి బాలీవుడ్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ.. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తో పూర్తి గా అర్ధమయ్యింది. ప్లాప్ సినిమాకే అక్కడి ప్రేక్షకులు [more]

Update: 2020-07-30 05:28 GMT

ప్రభాస్ కి బాలీవుడ్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ.. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తో పూర్తి గా అర్ధమయ్యింది. ప్లాప్ సినిమాకే అక్కడి ప్రేక్షకులు పట్టం కట్టారు కాబట్టే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై బాలీవుడ్ లో భీబత్సమైన క్రేజ్ వచ్చేసింది. ప్రభాస్ రాధేశ్యాం ఫస్ట్ లో లుక్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యాం బాలీవుడ్ హక్కుల కోసం ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నాట్టుగా న్యూస్. ఈమధ్యనే విడుదలైన రాధేశ్యాం ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన రావడంతో.. రాధేశ్యాం బాలీవుడ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

బాలీవుడ్ లో బడా నిర్మాతలైన కరణ్ జోహార్ ప్రభాస్ రాధేశ్యాం హక్కుల కోసం బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. గతంలో ప్రభాస్ బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలకు కరణ్ జోహార్ బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఆ సినిమా కి కరణ్ కి కాసుల వర్షం కురిసింది. తర్వాత సాహో విషయం ఎలా ఉన్నా ఇప్పుడు రాధేశ్యాం హక్కుల కోసం కరణ్ జోహార్ పావులు కడుపుతున్నాడట. ఇలాంటి టైం లో మరో నిర్మాత కూడా రాధేశ్యాం హక్కుల విషయంలో పోటీపడుతున్నట్లుగా న్యూస్ వినిపిస్తుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో రాధేశ్యాం బాలీవుడ్ హక్కులు ఓ రేంజ్ లో అమ్ముడు పోవడం ఖాయమంటున్నారు. మరి ప్రభాస్ రాధేశ్యాం విషయంలో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో కరోనా పూర్తయితే కానీ పక్కా క్లారిటీ రాదు అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News