సరికొత్త ప్రమోషన్స్

సినిమాకు సరైన ప్రమోషన్స్ ఉంటేనే ఓపెనింగ్స్ వస్తున్నాయి లేకపోతే అంతగా రావడంలేదు. అందుకే ఈ స్ట్రాటజీ తోనే మన మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.సినిమాలకి ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.ఇప్పుడు [more]

Update: 2019-10-17 10:15 GMT

సినిమాకు సరైన ప్రమోషన్స్ ఉంటేనే ఓపెనింగ్స్ వస్తున్నాయి లేకపోతే అంతగా రావడంలేదు. అందుకే ఈ స్ట్రాటజీ తోనే మన మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.సినిమాలకి ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.ఇప్పుడు ప్రమోషన్స్ కూడా రొటీన్ అయిపోవడంతో జనాలు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టడం లేదు.ఏదన్నా కొత్త‌ద‌నం చూపిస్తేనే వాళ్ల దృష్టి సినిమా వైపు మ‌ళ్లుతోంది.అందుకే బాలీవుడ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేస్తున్నారు. కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకొస్తుంటారు. లేటెస్ట్ గా బాలీవుడ్ లో రూపొందిన హౌస్ ఫుల్-4 చిత్రం విషయంలో డిఫరెంట్ గా
ఆలోచిస్తున్నారు.

జనాలు చూసేందుకు….

ఈ సినిమా ప్రమోషన్ కోసం వీరు ఇండియ‌న్ రైల్వేస్ స‌హ‌కారంతో ఓ ల‌గ్జ‌రీ రైలును రెంటుకు తీసుకున్నారు. ఆ రైలు బ‌య‌టా లోప‌లంతా హౌస్ ఫుల్ పోస్ట‌ర్ల‌తో నింపేసి ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌ధాన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లంద‌రినీ తీసుకుని ముంబ‌యి నుంచి ఢిల్లీకి టూర్ వెళ్ళబోతున్నారు. స్టేషన్స్ లో ఆగినప్పుడల్లా అక్కడ దిగి తమ సినిమాను ప్రమోట్ చేసుకోనున్నారు. ఇందుకోసం రైల్వే వాళ్ల‌కు భారీగానే చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల సినిమాపై జనాలకు ఇంట్రెస్ట్ వస్తుందని…ఓపెనింగ్స్ కూడా బాగుంటాయి అని వారి నమ్మకం. ఈ మూవీ ని సాజిద్ న‌డియాడ్ వాలా నిర్మించారు. హౌస్ ఫుల్-4 దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

 

 

Tags:    

Similar News