డిజాస్టర్ హీరోతో హిట్ డైరెక్టర్..!

నానితో ‘పిల్ల జమీందార్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అశోక్.. ఈ ఏడాది స్టార్టింగ్ లో అనుష్క తో “భాగమతి” సినిమాతో మన ముందుకు వచ్చాడు. [more]

Update: 2018-12-26 06:18 GMT

నానితో ‘పిల్ల జమీందార్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అశోక్.. ఈ ఏడాది స్టార్టింగ్ లో అనుష్క తో “భాగమతి” సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజై ఏడాది కావొస్తున్నా ఇంతవరకు అనుష్క తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు. అలానే డైరెక్టర్ అశోక్ కూడా తన తదుపరి మూవీని ప్రకటించలేదు. రీసెంట్ గా అశోక్ ఓ కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథ ను హీరో సాయి ధరమ్ తేజ్ కి చెప్పాడట. కథ విన్న తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

హారర్ ఎలిమెంట్స్ తో…

అశోక్ సాయితో పూర్తి స్థాయి హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. దానికి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” అనే సినిమా చేస్తున్నాడు. 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే అశోక్ మూవీని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. మరి ఇందులో ఇతర నటీనటుల ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News