ఆ సినిమాకు స్టార్ హీరోలు ఒప్పుకుంటారా..?

రచయిత్రి సుచిత్ర రావు గత ఏడాది ‘ది హైవే మాఫియా’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఆవిడ ఆ పుస్తకాన్ని దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల [more]

Update: 2019-01-19 06:16 GMT

రచయిత్రి సుచిత్ర రావు గత ఏడాది ‘ది హైవే మాఫియా’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఆవిడ ఆ పుస్తకాన్ని దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల అక్రమ రవాణా చేసే మాఫియా గురించి రాసింది. ఆ పుస్తకంలో సందేశాత్మక కథ ఉంది. అయితే ఈ కథతో ఇప్పుడు సుచిత్ర రావు ఒక సినిమా ప్లాన్ చేస్తుంది. ఆవిడ రాసిన ఆ పుస్తకంలోని కథను సందేశాత్మక సినిమాగా చెయ్యాలని ఆవిడ అనుకుంటున్నారట. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో చెయ్యాలని.. అలాగే ఆయా భాషల స్టార్ హీరోలు నటిస్తే బాగుంటుందని సుచిత్ర రావు చెబుతున్నారు. తెలుగులో అయితే సూపర్ స్టార్ మహేష్, హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, తమిళ్ లో విజయ్, కన్నడలో తాజా సంచలనం యశ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సుచిత్ర రావు వ్యక్తం చేస్తున్నారు.

వారు ఓకే అంటారా..?

హైవే మాఫియాపైకి సున్నితంగా కనిపించే బలమైన అంశాన్ని సినిమాగా చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలు భాషల నిర్మాతలతో, దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సుచిత్ర రావు తెలిపారు. మరి సుచిత్ర రావు ఆలోచన బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సూపర్ పొజిషన్ లో కొనసాగుతున్న మహేష్ బాబు, విజయ్ లు ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు సై అనాలంటే కథ మొత్తం హీరోయిజాన్ని హైలెట్ చెయ్యాలి. అలాంటప్పుడే మహేష్, విజయ్ లు ఆ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. మరి సుచిత్ర రావు వారికి కథను వినిపించి ఎలా ఓకె చేయించుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News