సరిలేరు నీకెవ్వరు’ లో అదే హైలైట్ అంట

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ట్రైన్ ఎపిసోడ్ కు సంబంధించిన పలు [more]

Update: 2019-08-16 09:28 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ట్రైన్ ఎపిసోడ్ కు సంబంధించిన పలు సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. ఈ ఎపిసోడ్ ఫుల్ హిలేరియస్ గా ఉంటాయి అని చిత్ర టీం చెబుతుంది. అనిల్ రావిపూడి కామెడీ సీన్స్ తీయడంలో దిట్ట అని మనకి తెలిసిందే. ఇక ఈసినిమా లో మహేష్ తో అనిల్ ఎలా కామెడీ చేయించించాడో అర్ధం చేసుకోవచ్చు.

కామెడీ పాత్రలో…

ట్రైన్ ఎపిసోడ్ కి సంబంధించి ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇందులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చాలా ఏళ్ళ తరువాత మళ్లీ కామెడీ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని టాక్ వినిపిస్తోంది. బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు అనిల్.. హీరోయిన్ రష్మిక..హరితేజ తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత కామెడీ గా ఉంటాదో అంతకు మించి ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని చెబుతున్నారు. మరి అనిల్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ ఇందులో మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి జనవరి లో ఈమూవీ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News