‘సాహో’ లో ఆ.. సీన్ హైలైట్ అంట!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ లాంటి క్రేజీ సిరీస్ తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ [more]

Update: 2018-12-29 07:46 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ లాంటి క్రేజీ సిరీస్ తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ గా రూపొందుతున్న ఈసినిమాలో ప్రభాస్ కి జోడిగా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. వచ్చే ఏడాది చిరంజీవి ‘సైరా’ కి పోటీగా ఈచిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

ఫస్ట్ లుక్ కు….

రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలవనున్నాయి అని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇందులో ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ దొంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీ లో చోరీ సీన్ ఒకటి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఒక నగల షాపును కొల్లగొట్టేందుకు హీరో స్కెచ్ వేస్తాడు. అయితే ఆ నగలు హీరో ప్రమేయం లేకుండానే అన్ని వచ్చి తన కారులో పడేలా తెలివిగా హీరో చేసిన ప్లాన్ చూసితీరవలసిందేనని చెబుతున్నారు.

విజిల్స్ ఖాయమట…..

ఈ సీన్ కు థియేటర్స్ లో విజిల్స్ పడతాయి అని యూనిట్ భావిస్తున్నారు. ‘ధూమ్’ సిరీస్ లోని చోరీ సీన్స్ కి మించి ఈ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన షాపింగ్ మాల్ సెట్లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. అలానే యూరోప్ లో తీయాల్సిన సీన్స్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే తీయాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News