భారీ పారితోషకాలూ… భారీ బడ్జెట్ లు

మహేష్ బాబు మహర్షి పనైపోయింది. మహర్షి హడావుడి మొత్తం ముగిసిపోయింది. ప్రస్తుతం విజయ నిర్మల ఆకస్మిక మరణంతో మహేష్ ఫ్యామిలీ మొత్తం బాధలో ఉన్నారు. విజయ నిర్మల [more]

Update: 2019-07-02 05:00 GMT

మహేష్ బాబు మహర్షి పనైపోయింది. మహర్షి హడావుడి మొత్తం ముగిసిపోయింది. ప్రస్తుతం విజయ నిర్మల ఆకస్మిక మరణంతో మహేష్ ఫ్యామిలీ మొత్తం బాధలో ఉన్నారు. విజయ నిర్మల దశదిన కర్మలు అయ్యాక మహేష్ బాబు తన కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా చేసినందుకు మహేష్ బాబు కి 50 కోట్ల పారితోషకం ముందే ఫిక్స్ అయ్యింది. నాన్ థియేట్రికల్ హక్కుల కింద వచ్చే మొత్తం మహేష్ కె చెందేలా పారితోషకం మాట్లాడుకున్నారట. ఇక ఈ సినిమాకి బడ్జెట్ మొత్తం 90 కోట్ల వరకు ఉండబోతుందట.

ఎలాగైనా 75 కోట్లలో ఈ సినిమాని పూర్తి చేయాలనీ నిర్మాతలు భావించినప్పటికీ… ఆ బడ్జెట్ కాస్త 90 కోట్ల పైమాటే అవుతుందట . ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కశ్మీర్లో 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని అంటున్నారు. కథ మేరకు రెండు భారీ సెట్లను నిర్మించవలసి ఉందట. అలాగే మిగతా నటీనటుల పారితోషకాలు కూడా 25 కోట్లు ఉంటాయంటున్నారు. అందులో సీనియర్ నటీమణి విజయశాంతికి 3 కోట్లదాకా పారితోషకం ఉంబోతుందనే టాక్ వినబడుతుంది. మరి మహర్షి కి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే.. వచ్చిన కలెక్షన్స్ పెద్ద గొప్పగా ఏమి రాలేదు. మరి అనిల్ రావిపూడి ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్టు అనేది సరిలేరు నీకెవ్వరూ కథను బట్టి ఉంటుంది

Tags:    

Similar News