మనస్సు మార్చుకున్న హీరోయిన్

మన తెలుగు అమ్మాయలు కోలీవుడ్ లో మంచి హీరోయిన్స్ గా ఎదగడం మనం చూస్తూనే ఉంటాం. అంజలి, శ్రీదివ్య మన తెలుగు అమ్మాయిలే కానీ వారికి అక్కడ [more]

Update: 2019-05-20 10:23 GMT

మన తెలుగు అమ్మాయలు కోలీవుడ్ లో మంచి హీరోయిన్స్ గా ఎదగడం మనం చూస్తూనే ఉంటాం. అంజలి, శ్రీదివ్య మన తెలుగు అమ్మాయిలే కానీ వారికి అక్కడ అవకాశాలు ఎక్కువ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయారు. అలానే మరో తెలుగు అమ్మాయి అక్కడ దుమ్ము రేపుతోంది. ఆమె ఐశ్వర్య రాజేశ్. కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో ఉన్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో కాదు.. ఒకప్పుడు తెలుగులో ‘మల్లెమొగ్గలు’తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. ప్రస్తుతం ఈమె క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం కానుంది. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది.

గుర్తింపు ఉన్న పాత్రలే చేస్తా

తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చిందని అటువంటి పాత్ర చేయడం వల్ల తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని అన్నారు. ఉదాహరణకు రీసెంట్ గా తాను చేసిన ‘సామీ స్క్వేర్’ సినిమా అని చెప్పారు. ఈ మూవీలో తాను రెండో హీరోయిన్ గా ఎంత మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానన్నారు. ఇకపై అటువంటి పొరపాట్లు చేయనని… తన పాత్రకు గుర్తింపు ఉండే పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పింది.

Tags:    

Similar News