నా పేరు సూర్య దెబ్బకి ఈ సినిమా ఆపేశారా..?

Update: 2018-05-24 08:11 GMT

'గరుడవేగ' చిత్ర తర్వాత డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు హీరో రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనేది తెలిసిన విషయమే. ఈ సినిమా స్రవంతి మూవీస్‌ బ్యానర్ లో తెరకెక్కబోతుంది. 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా తర్వాత రామ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది . కానీ సడన్ గా ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

వెనక్కుతగ్గిన నిర్మాత....

వివరాల్లోకి వెళితే మిలటరీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ ఈ సినిమా. దాదాపు షూటింగ్ మొత్తం హిమాలయాల్లో ప్లాన్ చేశారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉందంట. అయితే బడ్జెట్‌ రామ్‌ మార్కెట్‌ కంటే చాలా ఎక్కువట. ప్రాథమిక అంచనా ప్రకారమే నలభై కోట్లవుతుందని తేలిందట. దాంతో నిర్మాత రవికిషోర్‌ వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

కొత్త కథ తయారుచేస్తున్న ప్రవీణ్ సత్తారు...

మిలటరీకి సంబంధించిన కథలకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని, రామ్ చిత్రాలకి ఆదరణ వచ్చేదే ఆ వర్గం నుంచి అనీ, కనుక సినిమా చేయడం సబబు కాదని ఆయన రామ్‌కి నచ్చచెప్పారట. రామ్ కూడా రవి కిషోర్ చెప్పిన మాటలు విని రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఎందుకులే అని ప్రవీణ్ సత్తరుతో వేరే కథ రెడీ చేయమని చెప్పాడంట. దీంతో ప్రవీణ్ ఈ కథకు వేరే స్టార్ హీరో ఎవరైనా దొరుకుతాడా అనే వేటలో ఉన్నాడని సమాచారం.

Similar News