ఆలోచనలో పడ్డ రామ్!

Update: 2018-05-22 06:33 GMT

గత కొంతకాలంగా హీరో రామ్ కు సరైన హిట్ లేదు. 'నేను శైలజ' సినిమా తర్వాత రామ్ చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని వరస సినిమాలు చేస్తున్నాడు. ఒకటి త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మారిన నిర్మాతలు...

కథ పరంగా ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరగనుంది. అయితే ఈ సినిమాను మొదట్లో భవ్య క్రియేషన్స్ వారు నిర్మించడానికి ముందుకు వచ్చారు. కానీ వారు అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువవుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. దీంతో ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ వారు టేక్ ఓవర్ చేసి నిర్మించడానికి సిద్ధపడ్డారు.

భారీగా పెరుగుతున్న బడ్జెట్...

అయితే వారికి కూడా బడ్జెట్ విషయంలో సందేహాలు మొదలైనట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్ రవి కిషోర్ తో పాటు హీరో రామ్ కూడా ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తికరంగా మారింది.

Similar News