పవన్ మూవీపై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్..!

తమిళంలో హిట్టయిన ‘జిగ‌ర్తాండ్రా’ని తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టాడు. [more]

Update: 2019-05-04 07:17 GMT

తమిళంలో హిట్టయిన ‘జిగ‌ర్తాండ్రా’ని తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టాడు. ఈ సినిమాతో తమిళ నటుడు అధర్వ మురళి టాలీవుడ్ కి పరిచయం అవ్వనున్నాడు. అయితే ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు. ‘వాల్మీకి’ తరువాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయబోతున్నాయని… రీసెంట్ గా చర్చలు కూడా జరిగాయన్న వార్తనూ తోసిపుచ్చాడు హరీష్.

నిజం కాదు.. నమ్మొద్దు

ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తన నుండి కానీ లేదా ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ ఏదైనా అఫీషియ‌ల్ న్యూస్ వస్తానే నమ్మాలని కోరాడు. మరోవైపు ‘వాల్మీకి’ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే కంఫర్మ్ అయింది. ఈ సినిమా కోసం మేకర్స్ ఆమెకు భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. హరీష్ శంకర్ తో పూజ చేయడం ఇది రెండోసారి.

Tags:    

Similar News