పాపం భలే బుక్కయ్యిందే!!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అంటే మొన్నటివరకు అందరిలో ఓ జాలి ఉండేది. అంటే తల్లి చచ్చిపోయినా.. సినిమాలు చేసుకుంటుంది.. అంటూ శ్రీదేవి అభిమానులు ఆమెని బాగా [more]

Update: 2020-08-17 09:14 GMT

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అంటే మొన్నటివరకు అందరిలో ఓ జాలి ఉండేది. అంటే తల్లి చచ్చిపోయినా.. సినిమాలు చేసుకుంటుంది.. అంటూ శ్రీదేవి అభిమానులు ఆమెని బాగా చూసుకునేవారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణంతో జాన్వీ కపూర్ సినిమా వారసురాలు అవడమే శాపంగా మారింది. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు సినీ రంగ వారసులపై కత్తి కట్టారు. కాబట్టే జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా పై యుద్ధం ప్రకటించారు. అందులోను కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన గుంజన్ సంకేసనని చూడొద్దంటూ  సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమం నడిపించారు. జాన్వీ నటనకు =కామెంట్స్ చెయ్యడం, కరణ్ ని తిట్టిపోయాయడం అబ్బో మాములుగా లేదు.

ఆదాల ఉంటే తాజాగా గుంజన్ సక్సెనా లో తమను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు భారత వాయుసేన లేఖ రాసింది. సినిమా కోసం ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చూపించారని అంటున్నారు.  మాజీ పైలెట్ గుంజన్ సక్సేనా ఎయిర్ ఫోర్స్ కు అనుకూలంగానే మాట్లాడింది. వాయుసేనలో పురుషులతో సమానంగా తనకు సమానమైన అవకాశాలు వచ్చేవని… ఇక ఉన్నతాధికారులు కూడా తనకు ఎంతో అండగా ఉన్నారని ఆవిడా చెప్పింది. కానీ సినిమాలో లింగ విక్షను హైలెట్ చేస్తూ చూపించడంతో.. వాయుసేనను కించపరిచేలా సినిమా ఉందని ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ నుండి తెలిగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి జాన్వీ కపూర్ కి రెండో సినిమా విడుదల ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు. అసలే కరోనా తో తన సినిమా థియేటర్స్ లో విడుదల కాలేదంటూ బాధపడుతుంటే… మరోవైపు ఈ గోల ఒకటి అన్నట్టుగా ఉంది జాన్వీ పరిస్థితి. 

Tags:    

Similar News