గూఢచారిని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు

Update: 2018-08-03 12:46 GMT

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుఢచారి'. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూఢచారి చిత్రాన్ని నిర్మించారు. టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్, మధు షాలిని ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసారు. ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఇవాళ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం అన్నీ ఏరియాల నుండి యునానిమస్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హీరో అడివి శేషు, హీరోయిన్ శోభిత, దర్శకుడు శశికిరణ్, మాటల రచయిత అబ్బూరి రవి, కెమెరామెన్ శనియేల్ డియో, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర, లైన్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. ఈ సినిమా తమ ఐదేళ్ల కృషి అని.. సినిమాను ఆధిరిస్తున్న ప్రతీ ఒక్కిరికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు మంచి రేటింగ్స్, రివ్యూలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Similar News