మహేష్ బాబును ప్రశంసించిన జీఎస్టీ అధికారులు

ఏఎంబీ సినిమాస్ కి ప్రేక్షకుల నుండి జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన రూ.35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించిన మహేష్ బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ [more]

Update: 2019-02-22 12:56 GMT

ఏఎంబీ సినిమాస్ కి ప్రేక్షకుల నుండి జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన రూ.35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించిన మహేష్ బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. ఏఎంబీ సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్ లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని… మహేష్ బాబు, సునీల్ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.

Tags:    

Similar News