రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

రవితేజ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని స్పీడ్ అలా ఉంటది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ [more]

Update: 2019-07-27 08:28 GMT

రవితేజ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని స్పీడ్ అలా ఉంటది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేసే రవితేజ గత కొంతకాలం నుండి జోరు తగ్గించడంతో తన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే రవితేజ ఇప్పుడు తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్నాడు.

అవును రవితేజ రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టనున్నాడు. ప్రస్తుతం రవి… వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ కంప్లీట్ అయినా వెంటనే రవితేజ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ మీదకు తీసుకెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడట. ఒకటి అజయ్ భూపతి దర్శకత్వంలో. దీన్ని జెమిని కిరణ్ నిర్మించనున్నాడు. ఇంకోటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం. ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత.

ఇలా రెండు సినిమాలతో రెడీ గా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వనున్నాయి. అక్టోబర్ లో లేదా నవంబర్ లో ఈ రెండు సినిమాలు సెట్స్ మెడకు వెళ్తాయి అని సమాచారం. కాకపోతే ఈ రెండు చిత్రాలు మాస్ చిత్రాలు కావడం విశేషం. ఇప్పుడు మాస్ కె ఎక్కువ క్రేజ్ ఉంది టాలీవుడ్ లో. ఇంకా రవితేజ మాస్ చిత్రాలు చేస్తే వచ్చే కిక్ వేరు.

Tags:    

Similar News