ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

Update: 2018-10-01 08:44 GMT

రీఎంట్రీ తర్వాత వరస విజయాలతో దూసుకుపోతున్న వైజయంతి మూవీస్ సంస్థ భారీ కాంబినేషన్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి హిట్ చిత్రాలు అందించిన ఈ సంస్థ నుండి రీసెంట్ గా దేవదాస్ చిత్రం వచ్చింది. నాగార్జున - నాని కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ అశ్వనిదత్ తమిళ దర్శకుడు అట్లీతో ప్రాజెక్టును కన్ఫర్మ్ చేశారు.

ఎన్టీఆర్ హీరోగా..?

అట్లీ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం అని ప్రకటించారు. తమిళంలో రాజారాణి అనే సినిమాతో పాపులర్ అయిన అట్లీ ఆ తర్వాత తేరి, మెర్సల్ లాంటి సెన్సేషనల్స్ హిట్స్ తో భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమాలు కూడా తీయగలడని నిరూపించుకున్నాడు. మరి అట్లీ డైరెక్షన్ లో హీరో ఎవరు అని అనుకుంటున్నారా.? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండీ. ఈ న్యూస్ అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

2020 వరకు కుదరదు..!

ఇది తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించేందుకు వైజయంతి మూవీస్ సంస్థ భారీ సన్నాహకాల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అరవిందలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రాజమౌళి తో చేయనున్నాడు. ఇది వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎంతలేదన్నా జక్కన్న సినిమా ఏడాదిపైనే పడుతుంది. దీంతో అట్లీ సినిమా 2020లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంటుందని చెబుతున్నారు. మరోపక్క ఈ సంస్థ మహేష్ తో మహర్షి సినిమా చేస్తుంది.

Similar News