మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం [more]

Update: 2019-04-05 11:01 GMT

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘ఛోటి ఛోటి బాతే’కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఏప్రిల్‌ 6న ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌ లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News