గీత గోవిందంలో ఆ ఇద్దరు హీరోయిన్స్?

Update: 2018-08-12 05:42 GMT

ఈ నెల 15న విడుదల అయ్యే 'గీత గోవిందం' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ఈ చిత్రంను పరశురామ్ దర్శకత్వం చేశారు. గత నెల రోజులు నుండి తెలుగులో 'గూఢచారి' తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి కూడా జనాలని మెప్పించలేకపోయాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిత్య మీనన్ తో పాటు అను ఇమ్మానియేల్ క్యామియోల్లో కనిపిస్తారట.

గోవింద్ కు ఎక్స్ లవర్స్ గా వీరు నటించారని ఇన్ సైడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ బుధవారం వరకు ఆగక తప్పదు. ఆలా ఈఇద్దరు క్యామియోల్లో కనిపిస్తున్నారు అని టాక్ రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే మరి వీరి పాత్రలు సినిమాలో ఎంతసేపు ఉంటాయో తెలియాల్సిఉంది.

ఫ్యామిలి ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్న 'గీత గోవిందం' రన్ టైం 2 గంటల 28 నిమిషాలు. దర్శకుడు పరశురామ్ తన సింపుల్ డైలాగ్స్ తో మాయ చేస్తాడని.. అతని సినిమాల్లో ఆర్టిస్ట్స్ పెరఫార్మన్స్ బాగుంటదని నమ్ముతున్నారు. ఇక ఈమూవీకి గోపి సుందర్ మ్యూజిక్ హైలైట్ అని చెబుతున్నారు. మళ్ళి 31న 'శైలజారెడ్డి' అల్లుడు వచ్చే వరకు ఈ సినిమాకు పోటీ లేదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

Similar News