టెన్షన్ లో గీత గోవిందం..!

Update: 2018-08-23 06:12 GMT

రేపు విడుదలకానున్న ఆది పినిశెట్టి - తాప్సి - రీతూ సింగ్ కాంబోలో తెరకెక్కిన నీవెవరో సినిమాకి ట్రేడ్ లో పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే లేవు. నీవెవరో టీమ్ హీరోయిన్స్ ఇంటర్వూస్ ఇప్పిస్తున్నా సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలగడం లేదు. ఆఖరికి తాప్సి క్రేజ్ కూడా సినిమా మీద క్రేజ్ పెంచలేకపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కోన వెంకట్ ఎన్ని రకాలుగా ఎత్తులు వేసి కొత్తగా ప్రయత్నిస్తున్నప్పటికీ... సినిమా మీద మాత్రం క్రేజ్ పెంచలేకపోతున్నారు. ఆఖరికి నిన్న రామ్ చరణ్ చేతుల మీదుగా నీవెవరో సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

వెన్నెల కిషోర్ నే నమ్ముకున్నారా..?

ఎక్కువగా వెన్నెల కిషోర్ ఉన్న సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ నటించిన సినిమాలన్నీ వరసబెట్టి హిట్ అవుతున్నాయి. వెన్నెల కామెడీకి స్పెషల్ గా చప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకులు. అందుకే ప్రస్తుతం పెద్దగా బజ్ లేని నీవెవరో సినిమా మీద వెన్నెల కిషోర్ తో బజ్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే.. నీవెవరో ట్రైలర్ మొతం వెన్నెల పోలీస్ ఆఫీసర్ గా ఉన్న సీన్స్ తో కట్ చేసి సినిమా మీద కాస్త క్యూరియాసిటీ కలిగేలా చేశారు. తాజాగా వచ్చిన గీత గోవిందం సినిమాలో వెన్నెల కిషోర్ రష్మిక ను పెళ్లి చేసుకునే పెళ్లికొడుకులా బఫున్ పాత్రలో మెప్పించాడు.

హత్య చుట్టూ నడిచే కథ...

ఒక మర్డర్ కు సంబంధించిన పాయింట్ చుట్టూ కథ రాసుకున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి దివ్యాంగుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఆది పినిశెట్టి ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. ఆ కేసు విచారణ చేసే పోలీస్ గా గా వెన్నెల కిషోర్ నటించాడు. మరి సినిమా మీద వెన్నెల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు గానీ.. సినిమా విడుదలై దాదాపుగా ఎనిమిది రోజులు కావొస్తున్నా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఊపు మాత్రం తగ్గలేదు. అందుకే రేపు శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాలతో గీత గోవిందం టీమ్ కి టెన్షన్ అయితే పట్టుకుంది.

Similar News