పరుశురామ్ ఎందుకు ఖాళీగా ఉండిపోయాడు..?

గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పరుశురామ్ ఆ సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అతని వెంట [more]

Update: 2019-02-08 10:18 GMT

గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పరుశురామ్ ఆ సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అతని వెంట చాలామంది హీరోలు పడ్డా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అతను మైండ్ లో అనుకున్న కొంతమంది హీరోస్ తో తన సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. తన నెక్స్ట్ మూవీ గీత ఆర్ట్స్ లోనే ఉండబోతుంది. గీత ఆర్ట్స్ సంస్థ కూడా పరుశురామ్ కు మంచి హీరోతో సెట్ చేయాలని చాలా ట్రై చేసింది.

బిజీగా ఉన్న మ‌హేష్‌

ఈ నేపథ్యంలో మహేష్ ని సెట్ చేయాలని భావించింది గీత ఆర్ట్స్. మహేష్ తో ఓ సినిమా చేయాలని అరవింద్ అనుకుంటున్నట్లు బోగట్టా. ప్లానింగ్ అయితే జరిగింది కానీ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ వరస సినిమాలతో బిజీ అయిపోయాడు. కాబ‌ట్టి మహేష్ తో ఇప్పట్లో సినిమా లేనట్టే. మరి పరుశురామ్ ఏ హీరోని పెట్టి తన నెక్స్ట్ మూవీ చేస్తాడు? అసలు కథ రెడీ అయిందా? ఎందుకని ఇంత లేట్? ఇలా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సక్సెస్ వచ్చినప్పుడు చకచకా సినిమాలు చేస్తూ వెళ్లిపోవాలి కానీ అలా నీరసంగా కూర్చోకూడదు.

Tags:    

Similar News