కొత్త దర్శకుడిని రెండు సినిమాలకు లాక్ చేసిన గీతా ఆర్ట్స్!

Update: 2018-08-31 10:19 GMT

గీత ఆర్ట్స్ లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ అయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా గీత ఆర్ట్స్ 2 లో బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ తన ఓన్ బ్యానర్ లో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించాడు. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో బయటి హీరోలను తీసుకోవడం ఎందుకనుకుందో ఏమో.... గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లోనే బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తూ హిట్స్ కొడుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండలో గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గీత వారు... చిన్న సినిమా పేపర్ బాయ్ ని విడుదల చేశారు. ఇక తాజాగా ఇప్పుడు తమ సొంత హీరోల మీద ఫోకస్ చేశారు.

కొత్త దర్శకులను పట్టేస్తున్నారు...

కొత్త కథలతో కొత్త దర్శకులతో...గీత ఆర్ట్స్ వారు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి వారిని లాక్ చేసి పారేస్తున్నారు. తాజాగా మురగదాస్ శిష్యుడైన సింథిల్ అనే కుర్రాడిని.. దర్శకుడిగా గీత ఆర్ట్స్ వారు టాలీవుడ్ కి పరిచయం చెయ్యబోతున్నారు. మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సింథిల్ చెప్పిన రెండు కథలకు గీత ఆర్ట్స్ వారు కనెక్ట్ అవడమే కాదు.. ఆ రెండు కథలతో అల్లు హీరోలను సింథిల్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఒకేసారి సింథిల్ కి మెగా హీరోల ద్వారా బంపర్ ఆఫర్ దొరికితే... అది కూడా గీత ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లో సినిమాలు చెయ్యడం కూడా బంపర్ ఆఫర్.

అల్లు హీరోలతోనే రెండు సినిమాలు...

ఇక ఆ రెండు కథల్లో ఒక సినిమా అల్లు అర్జున్ తోనూ, మరొకటి అల్లు శిరీష్ తోనూ ఉండబోతుందని.. ముందుగా సింథిల్ అల్లు శిరీష్ సినిమాని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రాజెక్టులు పూర్తి కాగానే సింథిల్ దర్శకత్వంలో శిరీష్ నటిస్తాడట. తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందట. మరి ఈ రెండు సినిమాలకు సింథిల్ కి అప్పుడే గీత వారు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారనే ఫిలింనగర్ టాక్.

Similar News