ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు వచ్చిన ఏం లాభం!

Update: 2018-08-22 07:42 GMT

ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకి ఆసక్తిగా రేపేది కాకపోవడం గమనార్హం. ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ, రితిక సింగ్ హీరోయిన్లు గా రూపొందిన 'నీవెవరో' సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. టాక్ బాగుండి పికప్ అవ్వడం తప్ప ఈ సినిమాకు అంత బజ్ లేదు.

‘అంతకు మించి’ ఏమీలేదు..

ఇక నారా రోహిత్ జగపతి బాబు కాంబోలో 'ఆటగాళ్లు' అనే సినిమా వస్తున్నా విషయం సగటు ప్రేక్షకుడికి తెలియనంత సైలెంట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా టాక్ బాగుంటే తప్ప పట్టించుకునే వారు లేరు. అలానే యాంకర్ రష్మీ నటించిన 'అంతకు మించి' అనే హారర్ సినిమా పరిస్థితి కూడా అంతే. దీని గురించి ఎక్కడా బజ్ లేదు. ట్రైలర్స్.. వీడియో సాంగ్స్ లో రష్మీ ఎంత బాగా ఎక్స్ పోజ్ చేసినా మహా అయితే మొదటి ఆట తప్ప జనం తర్వాత ఈ మూవీని పెద్దగా లెక్క కూడా చేయరు.

థియేటర్ల కొరత ఉన్నా...

ఇక ఈ లిస్ట్ లో ప్రభుదేవా నటించిన డాన్స్ మూవీ 'లక్ష్మి' కూడా ఉంది. డైరెక్టర్ విజయ్ రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఇందులో డాన్సులు తప్ప ఏమీ లేవని అర్ధం అవుతుంది. సో ఈ సినిమాతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ సినిమాకి సి కళ్యాణ్ లాంటి పేరున్న నిర్మాత ఉన్నా పబ్లిసిటీ తక్కువైంది. దీనిపై కూడా జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. 'గీత గోవిందం' ఇంకా మార్కెట్ లో ఉన్న టైంలో ఒకేసారి ఇన్నేసి సినిమాలు విడుదల చేయటంలో పరమార్థం వారికే తెలియాలి. అసలే చాలా సెంటర్స్ లో థియేటర్ల కొరత కూడా ఉంది.

Similar News