'శైలజారెడ్డి అల్లుడు' తొలి గీతం 'అను బేబీ' విడుదల

Update: 2018-08-10 08:14 GMT

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం తొలి గీతం 'అను బేబీ' ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు.

Similar News